రఘునాథపాలెంలో జోరుగా టిఆర్ఎస్ ప్రచారం

రఘునాథపాలెంలో జోరుగా టిఆర్ఎస్ ప్రచారం (ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి, సూర్యపేట 14 : హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మఠం పెల్లి మండలం రఘునాథపాలెం చేరుకున్న ప్రముఖ వైశ్య నాయకులు ఆల్ ఇండియా అగ్రోఇన్సు డీలర్స్ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్ డీలర్స్ అసోసియోషన్ అధ్యక్షులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, హుజురనగర్ ఇంచార్జీ గౌరిశెట్టి మునీందర్, తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యులు ముర్రంశెట్టి రాములుకు మనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్‌నగర్ టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. టిఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయన్నారు. 57 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి 2016/- దివ్యాంగులకు 3,016/-, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1లక్ష 116 రూపాయలు, రైతు భీమా, రైతు ఇంచార్జీ బంధు పథకాల ద్వార వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారన్నారు. సమస్యల పరిష్కారం కోసం అర్టీసి కార్మికులు చేస్తున్న పోరాటం త్వరలోనే పరిష్కారమవు తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.