అతి వేగంతో వచ్చి బోల్తా పడిన కారు..

అతి వేగంతో వచ్చి బోల్తా పడిన కారు..


మేడ్చల్: అతి వేగం కారణంగా ఓ కారు బోల్తా పడింది. మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డులో ఓ కారు తెల్లవారుజామున అతి వేగంగా వచ్చి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.